పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌళిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి

Spread the love

పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌళిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి

-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్

పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌళిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. శనివారం కలెక్టర్, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభితో కలిసి, ఖమ్మం అర్బన్ మండలం బల్లెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాలాజినగర్ యూపీహెచ్ కాలనీలోని జిల్లా పరిషత్ ప్రాధమిక పాఠశాల, ఖానాపురం లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలను సందర్శించి, పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల్లో త్రాగునీరు, విద్యుత్, రన్నింగ్ వాటర్ తో టాయిలెట్ తదితర అన్ని మౌళిక సదుపాయాలు వుండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కాంపౌండ్ వాల్ లేని పోలింగ్ కేంద్రాల పాఠశాలలకు వెంటనే నిర్మించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఒకే లోకేషన్ లో ఒకటికి మించి ఎక్కువ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ఉన్నచోట, క్యూ రద్దీ, భద్రతా సమస్యలు తలెత్తకుండా వేర్వేరు బ్లాకులో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రం లోపల ఫ్యాన్లు, లైట్లు వుండేలా, కేంద్రం వెలుపల వెలుతురు వుండేలా లైటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. ఓటర్లకు, పోలింగ్ సిబ్బంది కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా నగరపాలక సంస్థ ఇఇ కృష్ణలాల్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సిహెచ్. స్వామి, మండల విద్యాధికారి శ్రీనివాసరావు, డిఇ ధరణి, రామకృష్ణ, అధికారులు తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page