తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మత్స్యరంగం ఎంతో అభివృద్ధి సాధించిందని, మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని మత్స్య భవన్ లో జరిగిన మత్స్య సహకార సొసైటీల చైర్మన్ గా పిట్టల రవీందర్ పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రవీందర్ కు మంత్రి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ వివిధ కులవృత్తుల పై ఆధారపడి జీవిస్తున్న వారి కుటుంబాలలో వెలుగులు నింపాలి, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి లక్ష్యం అన్నారు. అందులో భాగంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా కోట్లాది రూపాయల వ్యయంతో రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత మత్స్యకారులు నాటి ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పూడిపోయి, పిచ్చిమొక్కలతో నిండిన చెరువులు మిషన్ కాకతీయ అనే ఒక గొప్ప కార్యక్రమం ద్వారా పునరుద్దరణ, నూతన రిజర్వాయర్ ల నిర్మాణంతో నిరంతరం చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్న విషయాన్ని గుర్తుచేశారు. గతంలో చెరువులపై దళారుల పెత్తనం ఉండేదని, మత్స్యకారులకు మేలు చేయాలనే ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు పంచాయితీ రాజ్ పరిధిలో ఉన్న చెరువులను కూడా మత్స్య శాఖ పరిధిలోకి బదిలీ చేసి సర్వహక్కులు మత్స్యకారులకు అప్పగించినట్లు వివరించారు. చేపలను తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవద్దని మంత్రి సూచించారు. ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలతో రాష్ట్రంలో మత్స్య సంపద ఎవరు ఊహించని రీతిలో పెరిగిందని, మత్స్య కారులు ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. చేపలను అమ్ముకోవడానికి మత్స్యకారులకు ట్రక్ లు, ట్రాలీ ఆటోలు, ద్విచక్ర వాహనాలు సబ్సిడీ పై అందజేసినట్లు చెప్పారు. అదేవిధంగా వివిధ రకాల చేపల వంటకాలను అమ్ముకోనేందుకు వీలుగా సంచార విక్రయ వాహనాలను కూడా అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇంకా మిగిలిన అర్హులైన మత్స్య కారులకు కూడా సబ్సిడీ పై వాహనాలు అందజేసే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని ప్రకటించారు. వచ్చే నెల 8 వ తేదీన మృగశిర కార్తె సందర్బంగా మొదటి సారిగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఫిష్ పుడ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఫెస్టివల్ లో వివిధ రకాల చేపల వంటకాలను స్టాల్స్ ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. మత్స్యరంగం పై ఎంతో అనుభవం ఉన్న పిట్టల రవీందర్ చైర్మన్ గా బాద్యతలు చేపట్టడం వలన ఈ రంగం మరింత అభివృద్ధి లో ముందుకు వెళుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, MLC లు పాడి కౌశిక్ రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, కార్పోరేషన్ చైర్మన్ లు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, కోలేటి దామోదర్ గుప్తా, గెల్లు శ్రీనివాస్ యాదవ్, అల్లం నారాయణ, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
Home
Telangana
మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు
Related Posts
Spread the love ఎన్బీఈఎంఎస్ నిర్వహించే జీప్యాట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది. దేశంలో ఫార్మసీ అనుబంధ యూనివర్సిటీలు/ కళాశాలలు/ సంస్థల్లో ఎం.ఫార్మసీ, పీహెచ్డీలో ప్రవేశానికి జీప్యాట్ స్కోరు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ తర్వాత ఫార్మసీలో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ/ తత్సమానం ఉత్తీర్ణులైన వారు అర్హులు.…
Spread the love నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 28వ డివిజన్ పుష్పక్ అపార్ట్మెంట్ లో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్,కార్పొరేటర్లు జ్యోతి నర్సింహా రెడ్డి, సుజాత,ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో…
Spread the love ప్రజల సమస్యలు, పార్టీ విస్తరణ లక్షయంగా కార్యకర్తలు పనిచేయాలి.*మతోన్మాద బీజీపీని ఓడిస్తేనే దేశానికి రక్షణ.*సార్వత్రిక ఎన్నికల్లో సిపిఐ శ్రేణులు భాద్యతగా పనిచేయాలి.*కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.* సాక్షితభద్రాద్రి కొత్తగూడెం//సుజాతనగర్: మండల పరిధిలోని నాయకులగూడెం, మర్రితండా, సుజాతనగర్…
Spread the love భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి బి ఆర్ ఎస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చింతనిప్పు కృష్ణ చైతన్య రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు తాత…
Spread the love ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి చలువ కళ్ల అద్దాలు (కూలింగ్ గ్లాసెస్) ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అందజేశారు. రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకొని హైదరాబాదు కు చెందిన వై పి ఎస్ హాస్పిటల్…
Spread the love మండుటెండలో వాహనాలను తనిఖీచేసిన సీఐ.. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తల్లాడలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కల్లూరుకు వెళ్లే రోడ్డులో చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ చెక్ పోస్ట్…
Spread the love మల్కాజిగిరి పార్లమెంట్ మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని కీసర మండల కేంద్రంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో జరిగిన భారత రాష్ట్ర సమితి 23వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పాల్గొని, జెండా ఆవిష్కరణ చేసిన మల్కాజిగిరి బీఆర్ఎస్…
Spread the love జగద్గిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓరుగంటి కృష్ణా గౌడ్ , రషీద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత…
Spread the love బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు భారాస పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని కమల ప్రసన్న…
Spread the love శేరిలింగంపల్లి డివిజన్ లోగల గిడ్డంగి లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ముఖ్య అతిధులుగా హాజరైన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిపారు. ఆవిర్భావ…