స్వామియే శరణం అయ్యప్ప శరణు ఘోష తో ఆదర్శనగర్ లోని MLA క్వార్టర్స్ పరిసరాలు

Spread the love

Swamye Saranam Ayyappa Saranu Ghosha and vicinity of MLA Quarters in Adarshanagar

సాక్షిత : స్వామియే శరణం అయ్యప్ప శరణు ఘోష తో ఆదర్శనగర్ లోని MLA క్వార్టర్స్ పరిసరాలు రాత్రి మార్మోగాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటంబ సభ్యుల ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడిపూజను ఆదర్శనగర్ లోని MLA క్వార్టర్స్ అత్యంత ఘనంగా నిర్వహించారు.

అయ్యప్ప మహా పడిపూజ మండపం, పరిసరాలను విద్యుత్ దీపాలు, రంగురంగుల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ పూజలకు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ప్రముఖ సినీ నటులు పద్మ శ్రీ చిరంజీవి, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్, MLC లు కల్వకుంట్ల కవిత, సురభి వాణిదేవి, MS ప్రభాకర్ రావు, నవీన్ రావు, MLA లు ముఠా గోపాల్, దానం నాగేందర్, మున్సిపల్ శాఖ ప్రిన్స్ పల్ సెక్రెటరీ అరవింద్ కుమార్,

పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్య, పోలీస్ కమిషనర్ CV ఆనంద్, TSMIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, షీఫ్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, FDC చైర్మన్ అనిల్ కుమార్ కూర్మాచలం,తెలంగాణ పుడ్స్ కార్పోరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్, బేవరేజెస్ కార్పోరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచారి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, MLC తాతా మధు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

పూజలలో పాల్గొన్న వారికి మాలధారణ చేసిన మంత్రి తనయుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ శాలువాలతో సత్కరించారు. మహా పడి పూజ సందర్భంగా కేరళ డప్పు కళాకారుల వాయిద్యాలు ప్రత్యేక అకర్షణగా నిలిచాయి. ఈ డప్పు వాయిద్యాలతో అతిధులకు స్వాగతం పలికారు. స్వామి వారి పల్లకీ సేవ అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ అయ్యప్ప స్వాములతో కలిసి నృత్యం చేశారు.

Related Posts

You cannot copy content of this page