సమతా కుంభ్‌ బ్రహ్మోత్సవాలు

Spread the love

Samata Kumbh Brahmotsavam

సమతా కుంభ్‌ బ్రహ్మోత్సవాలు

శంషాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో ఈ నెల 2 నుంచి 14 వరకు సమతా కుంభ్‌-2023 బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసినట్లు జీవా ప్రతినిధులు పేర్కొన్నారు.

త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి పర్యవేక్షణలో సువర్ణమూర్తి భగవద్రామానుజులకు ఉత్సవారంభ స్నపనంతో వేడుకలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

మొదటి రోజు కార్యక్రమాలు..

ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విష్వక్సేన వీధి శోధన

మ.1.30 గంటలకు తీర్థ ప్రసాద గోష్ఠి

సా.5 నుంచి 5.45 వరకు సామూహిక విష్ణు సహస్రనామస్తోత్ర పారాయణం

సా.6 నుంచి 8.30 వరకు వేదికపై అంకురార్పణ వైనతేయ ప్రతిష్ఠ, త్రీర్థ ప్రసాద గోష్ఠి.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page