రేవంత్ రెడ్డి ఇంటికి దగ్గరలోనే డివైజ్ అమర్చిన ప్రణీత్ రావు, రవిపాల్

Spread the love

సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరుపుతున్నా కొద్ది మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావును ప్రశ్నిస్తున్నా కొద్దీ నిజాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఎస్‌ఐడీకి టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఉన్న రవిపాల్ ఈ కేసు విచారణలో కీలకంగా మారాడు.

రవిపాల్ నేతృత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ డివైజ్‌లను తీసుకువచ్చినట్లు దర్యాప్తులో గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా టాపింగ్ డివైజ్‌లను రవిపాల్ తీసుకొచ్చాడు. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయిల్ నుంచి ఈ పరికరాలను రవి పాల్ దిగుమతి చేశాడు. అందుకుగానూ రవిపాల్‌కి ఎస్‌ఐబీ పెద్ద ఎత్తున కోట్ల రూపాయలను చెల్లించిందని గుర్తించారు.

రవిపాల్, ప్రభాకర్ రావు ఇద్దరూ కలిసి అధునాతన డివైజ్‌లను దిగుమతి చేసుకున్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. ఈ అధునాతన పరికరాలతో 300 మీటర్ల పరిధిలో మాట్లాడే మాటలను నేరుగా వినబడతాయని తేలింది.

రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఆఫీస్ ఏర్పాటు చేసి ఈ డివైజ్‌లను రవి పాల్ ఏర్పాటు చేశాడు. రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రణీత రావు, రవిపాల్ ఇద్దరూ విన్నారు. రవి పాల్‌ని ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు..

Related Posts

You cannot copy content of this page