గ్రామాలలో ప్రజలు దుర్భర జీవనం గడుపుతున్నారు

Spread the love

People are living a miserable life in the villages

గ్రామాలలో ప్రజలు దుర్భర జీవనం గడుపుతున్నారు:-నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు

కేశానుపల్లి గ్రామ పరిదిలో గల ఎస్టి కాలనీలో మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని కాలనీ ప్రజలు దర్భర జీవనం గడుపుతున్నారని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు తెలిపారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అదేశాల మేరకు నరసరావుపేట నియోజకవర్గంలో కేశానుపల్లి, పెదతురకపాలెం,మాగం పుల్లారావు కాలని గ్రామాల్లో “ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి” కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాగం పుల్లారావు కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను డా౹౹చదలవాడ అరవింద బాబు నేరుగా అడిగి తెలుసుకున్నారు.కాలనీలో ప్రజలు దుర్భర జీవనం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని కాలనీలో వర్షపు నీరు ప్రవహించేందుకు కనీసం మురుగు కాల్వలు లేక పోవడంతో మురుగునీరు ఇళ్లలోకి వచ్చి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం పన్నుల రూపంలో పేద ప్రజలను పట్టి పీడిస్తుందని గ్రామాలలో మాత్రం కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించడంలేదన్నారు.

కాలనీలో ప్రజలు ఎదర్కోంటున్న సమస్యలను కాలనీ ప్రజలతో కలసి సోమవారం కలెక్టరు కలసి సమస్యలను వివరించనున్నట్లు తెలిపారు.అనంతరం కేశానపల్లి, పెదతురకపాలెం గ్రామాల్లో “ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి” కార్యక్రమంలో డా౹౹చదలవాడ పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పన్నుల రూపంలో పేద ప్రజలను పట్టి పీడిస్తుందని తెలిపారు.రాష్ట్ర భవిష్యత్తు,మన బిడ్డల భవిష్యత్తు కోసం మనమంతా రామన్న రాజ్యం కోసం చంద్రన్నకు అండగా ఉండాలని డా౹౹చదలవాడ అరవిందబాబు పిలుపినిచ్చారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page