చిన్నారి రిషిక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే కొడాలి నాని

Spread the love

-కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి….. ఉపాధి నిమిత్తం 50వేల సహాయాన్ని అందజేసిన ఎమ్మెల్యే

-బాధలో ఉన్నా తమను ఓదార్చి…. అడగకుండానే సహాయం చేసిన ఎమ్మెల్యే నానికు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు

గుడివాడ07:గుడివాడ రూరల్ మండలం మోటూరులో తండ్రి ఆటో కింద పడి మరణించిన నాలుగేళ్ల బాలుడు వరిగంజి రిషిక్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కొడాలి నాని రాత్రి పరామర్శించారు. కన్నీటి పర్యంతమవుతున్న రిషిక్ తండ్రి మురళి దంపతులను ఓదార్చిన ఎమ్మెల్యే కొడాలి నాని వారికి మనోధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా ప్రమాద ఘటనను కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే నానికు వివరించారు. అద్దె ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నామని మురళి ప్రస్తావించగా తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే కొడాలి నాని 50 వేల సహాయాన్ని అందజేశారు.

అభం శుభం తెలియని చిన్నారి రిషిక్ మృతి బాధాకరమని ఎమ్మెల్యే నాని ఆవేదన వ్యక్తం చేశారు.బాధలో ఉన్న తమను పరామర్శించడమే కాకుండా, జీవనోపాధికి సహాయం అందించిన ఎమ్మెల్యే కొడాలి నానికు రిషిక్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. మోటూరు గ్రామ సర్పంచ్ కోరగంటి పద్మ, ఎంపీటీసీ సభ్యురాలు వరలక్ష్మి, మోటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గంటా సురేష్, పిఎసిఎస్ అధ్యక్షుడు ఇమ్మడి అశోక్, ఇమ్మడి తాతాజీ, కోరగంటి పండు, స్థానిక కాలనీవాసులు రిషిక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page