టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి యనమల కృష్ణుడు

Spread the love

కాకినాడ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. యనమల కృష్ణుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రేపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గత నలభై ఏళ్లగా అన్న యనమలకు, టీడీపీకి నమ్మకంగా ఉన్నారు కృష్ణుడు. తుని ఇంచార్జ్ మార్పుతో యనమల సోదరుల మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో కృష్ణుడు పోటీ చేసి ఓటమిపాలైయ్యడు. ప్రస్తుతం యనమల కృష్ణుడు రాజీనామా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Related Posts

You cannot copy content of this page