సాక్షిత ; దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పలు సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్ధిక ఇబ్బందుల నుండి గట్టెక్కిచ్చిన గొప్ప నాయకుడు, ఆర్ధిక సంస్కరణల జాతిపిత మాజీ ప్రధానమంత్రి PV. నరసింహారావు అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాజీ ప్రధానమంత్రి PV 102 వ జయంతి సందర్భంగా PV మార్గ్ లో గల PV ఘాట్ లో మంత్రి తలసాని నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి PV నరసింహ రావు అని పేర్కొన్నారు. బహుబాషా కోవిదుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు గా పేరుగాంచారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని తెలంగాణ ప్రభుత్వం PV సేవలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ తగినరీతిలో గౌరవిస్తుందని చెప్పారు. PV శతజయంతిని ఎంతో ఘనంగా నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా నెక్లెస్ రోడ్డుకు PV మార్గ్ గా నామకరణం చేయడమే కాకుండా భారీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తినట్లు వివరించారు. ప్రపంచ దేశాలలో భారతదేశ ఖ్యాతిని చాటిచెప్పిన PV నరసింహారావు కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి తలసాని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో MLC, PV కుమార్తె సురభి వాణిదేవి, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ, RDO వసంత తదితరులు ఉన్నారు.
Home
Telangana
ఆర్ధిక సంస్కరణల జాతిపిత మాజీ ప్రధానమంత్రి PV. నరసింహారావు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు
Related Posts
Spread the love లక్ష్మీ నరసింహ స్వామి మాజీ టెంపుల్ చైర్మన్ కస్తూరి నరహరి గుప్తాటిఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు అధ్వర్యంలో జాయిన్ అయ్యారుపాల్వంచ మండలంలోని ఇసాయిపేట గ్రామస్తులు…
Spread the love 126 – జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దూమ్ నగర్ నందు నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యేగా కేపీ.వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ…
Spread the love ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి చించోడు, దేవునిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ★ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఉపాధి హామీ కూలీలకు వందరోజుల…
Spread the love పాలమూరు గొంతు పార్లమెంట్లో పక్క ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి షాద్ నగర్ : ◆ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గం ఫారూఖ్ నగర్ మండల పరిధిలోని మోగిలిగిద్ద…
Spread the love ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపుదేశంలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లోని భోపాల్ విమానాశ్రయానికి గుర్తుతెలియని వ్యక్తులు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించామన్నారు. బాంబ్ స్క్వాడ్,…
Spread the love సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి: ఎంపీ అర్వింద్సీఎం రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కీలకవ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్ హుందాగా వ్యవహరించాలి. హోంమంత్రి వీడియోలు మార్ఫ్ చేస్తే ఊరుకుంటారా. అమిత్ షా…
Spread the love జూన్ 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలుతెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. ఓవరాల్ గా 91.31 శాతం…
Spread the love మార్నింగ్ వాకర్స్ & ఇంటింటి ప్రచారం నిర్వహించిన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు పాల్గొని మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.. మల్కాజ్గిరి పార్లమెంట్…
Spread the love TSIIC చైర్మన్, డిసిసి అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డితో కలిసి సిపిఎం పార్టీ ఆఫీసుకు.. బిజెపి ఓటమే లక్ష్యంసంగారెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ సంగారెడ్డి జిల్లా సిపిఎం నేతలతో మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు మంగళవారం…
Spread the love అభ్యర్థుల ఖర్చు వివరాల తనిఖీలకు కార్యాచరణ చేస్తున్నాం -ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లోకసభ సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని…