బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కుత్బుల్లాపూర్ సంపూర్ణ అభివృద్ధి చెందింది : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

Spread the love

126 – జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దూమ్ నగర్ నందు నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యేగా కేపీ.వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులతో మౌలిక వసతులు కల్పిస్తూ సంపూర్ణ అభివృద్ధి చేశామన్నారు. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని మరిచి రాజకీయాలకే ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధిని మరిచారన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధిని కొనసాగించాలంటే ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి ని మే 13న జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీ అందించాలన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ వేణు యాదవ్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, డివిజన్ మాజీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, సీనియర్ నాయకులు హజ్రత్ అలీ, బండ మహేందర్, శశిధర్ ముదిరాజ్, పాపులు గౌడ్, దినేష్, ఇందిరాగౌడ్, రేణుక యాదవ్, మల్లారెడ్డి, జై హింద్, వెంకట్ రెడ్డి, లక్ష్మణ్, శాంతి, శోభ, మంజుల, మెట్ల శ్రీను, ఆజం, మహమూద్, యాదగిరి, మనోజ్, నర్సింగ్, పప్పి రెడ్డి, దాసు, విటల్, నాగరాజు, నరసింహారెడ్డి, బ్రహ్మానంద చారి, రాజమణి, త్రివేణి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page