9.5లక్షల వ్యయంతో నిర్మించిన మాదిగ చైతన్య సంక్షేమ సంఘం భవనాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

Spread the love

కీర్తిశేషులు కె.ఎం. పాండు జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ గ్రామంలో వారి జ్ఞాపకార్థం 9.5లక్షల వ్యయంతో నిర్మించిన మాదిగ చైతన్య సంక్షేమ సంఘం భవనాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ …

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో హరిజనవాడలో కీర్తిశేషులు కె.ఎం పాండు జయంతి సందర్భంగా ఎమ్మెల్యే సొంత నిధులతో కె.ఎం.పాండు జ్ఞాపకార్థం 9.5లక్షల వ్యయంతో నిర్మించిన మాదిగ చైతన్య సంక్షేమ సంఘం భవనాన్నిమంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కె.ఎం. పాండు పేద ప్రజల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారు అని అన్నారు,ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ సీనియర్ నాయకులు, సంక్షేమ సంఘాల కార్యవర్గ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page