ప్రధాని ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని విద్యార్థులతో కలిసి వీక్షించిన కూన శ్రీశైలం గౌడ్

Spread the love

Koona Srisailam Goud watched the Prime Minister’s ‘Pariksha Pe Chichar’ program along with the students

ప్రధాని ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని విద్యార్థులతో కలిసి వీక్షించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్


సాక్షిత : భారత ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థులను ఉద్దేశించి చేపట్టిన ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ భగత్ సింగ్ నగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులతో కలిసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.

పరీక్షలను పండుగల్లా జరుపుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, ప్రధాని చెప్పిన చిట్కాలను పాటించాలని మాజీ ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, డివిజన్ అధ్యక్షులు పత్తి సతీష్,

ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సదానందం, డివిజన్ ఇంచార్జ్ సుశాంత్ గౌడ్, నాయకులు జితేందర్ రెడ్డి, రాజేష్ చారి, నాయకులు ప్రతాప్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, ఆదిత్య, పలువురు నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page