కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపేట్ లోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు 2 కోట్ల 70 లక్షల రూపాయలతో శంకుస్థాపన 

Spread the love

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపేట్ లోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు 2 కోట్ల 70 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు ..ఇందులో ప్రధానంగా పిఆర్ నగర్.. బబ్బుగూడ… అవంతి నగర్ తోట.. స్నేహపురి కాలనీలో పలు సిసి మరియు బీటీ రోడ్ల కొరకు శంకుస్థాపన నిర్వహించారు.. అలాగే ఈ ప్రాంతంలో పార్కుల అభివృద్ధి కొరకు శంకుస్థాపన చేశారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూకట్పల్లిలోని ప్రతి డివిజన్లోని పార్కులు.. రోడ్లు మంచినీరు వంటి మౌలిక సదుపాయాలకు ఎక్కడా లోటు లేకుండా 100% పనులు పూర్తి చేశామని …ఇప్పుడు శంకుస్థాపన నిర్వహించిన పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.. కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ అడిగిన వెంటనే నిధులు అందిస్తూ ఎంతో సహకరిస్తున్నారని గత తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని అభివృద్ధి చేసుకున్నామని నేడు మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్రజలు ఎక్కడ సమస్యలు తలెత్తడం లేదని తెలుపుతున్నారని అన్నారు.. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్.. డివిజన్ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page