సికింద్రాబాద్ లో డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు బుధవారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు.

Spread the love

సాక్షిత : సికింద్రాబాద్ పరిధిలోని అడ్డగుట్ట, , తార్నాక, మెట్టుగూడ, సితాఫలమండీ, బౌద్దనగర్ డివిజన్లలో కలిపి 17 కేంద్రాల ద్వారా 65,972 మందికి బతుకమ్మచీరలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. దసరా పండుగ వరకు అర్హులైన వారందరికే ఈ చీరల పంపిణీకి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
— అన్ని మతాల పండుగలను ఘనంగా నిర్వహించుకొనేందుకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తన తోడ్పాటును అందిస్తోందని, ఈ క్రమంలో బతుకమ్మ చేరాల పంపిణీ ని చేపట్టామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కార్పొరేటర్ లు సామల హేమ, రాసురి సునీత, బీ ఆర్ ఎస్ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, అధికారులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీనాద్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page