మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే ఎక్కడో ఢిల్లీలో ఉండే నాయకత్వం కాదు

Spread the love

మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే ఎక్కడో ఢిల్లీలో ఉండే నాయకత్వం కాదు మనతో పాటు మనలో ఒకటైన బిఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళీ రావాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద ….

సాక్షిత : 131- కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్, ఇంద్ర సింగ్ నగర్, వాణి నగర్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్డు, కాకతీయ నగర్, మల్లికార్జున నగర్, అంబేద్కర్ నగర్, చెరుకుపల్లి కాలనీ, రామకృష్ణ నగర్, సంజీవయ్య నగర్, వాజ్ పేయ్ నగర్, దత్తాత్రేయ నగర్ లలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదలు తొమ్మిదిన్నరేళ్ల కాలంలో కాలనీలు, బస్తీలలో సిసి రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నూతన మంచినీటి పైప్ లైన్ పనులను చేపట్టామని, అదేవిధంగా లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందజేశామని రానున్న రోజుల్లో మరింత మందికి సంక్షేమ పథకాలు అందించడంతోపాటు బస్తీలు, కాలనీలల్లో మౌలిక వసతులు కల్పిస్తూ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. మన సంక్షేమం – మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఎక్కడో ఢిల్లీలో ఉండి పనిచేసే నాయకులు కాదు మన తోటి, మన మధ్య ఉండే నాయకులు కావాలన్నారు. అందుకు నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ఓటర్లంతా మూడవ నెంబర్ పై ఓటు వేసి ముచ్చటగా మూడవసారి భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, బూత్ స్థాయి నాయకులు, పలు కాలనీల సంక్షేమ సంఘం సభ్యులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 27 At 2.30.28 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page