బూర నర్సయ్య గౌడ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి -సంకినేని వెంకటేశ్వరరావు

Spread the love

సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ గెలుపుకై వెలుగుపల్లి, వెంపటి , రావులపల్లి ఎక్స్ రోడ్డు గ్రామాలలో బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ తో కలిసి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొని భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాల్సిందిగా ప్రజలను అభ్యర్థించారు. దేశ ప్రజలందరూ మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని చూడాలనుకుంటున్నారని మోడీ ప్రభుత్వ హాయంలోనే రాష్ట్రంలో జాతీయ రహదారులను నిర్మించారని కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలందరూ ఎప్పుడో తిరస్కరించారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆదరణను పొందలేక బిజెపిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. మే 13 వ తేదీన జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు.

Related Posts

You cannot copy content of this page