రాబోయే ఐదేళ్లు నేను మీతోనే..

Spread the love
  • ముగ్గురు మంత్రులు, రాజ్యసభ సభ్యురాలు సారధ్యంలో పనిచేస్తా
  • నగరంలో కాంగ్రెస్ సమావేశంలో పార్టీ లోక్ సభ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

భారీ విజయాన్ని అందించాలని శిరస్సు వంచి ప్రాధేయపడుతున్నా అని..సీపీఐ, సీపీఎం బలపర్చిన కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. ఉదయం నగరంలోని ఓ హోటల్ లో నిర్వహించిన పార్టీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనం లో మాట్లాడారు. సీనియర్, యువ నాయకుల సమష్టి కృషితో ముందుకు పోదాం అన్నారు. ఘన చరిత్ర ఉన్న మన జిల్లా ప్రజలకు సేవ చేసేందుకు ఈ ఐదేళ్లు పూర్తిగా ప్రజలతోనే ఉంటా అని తెలిపారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి నేతృత్వంలో పనిచేస్తా అని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, నాయకులు తుమ్మల యుగేoదర్, సాధు రమేష్ రెడ్డి, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, బాల గంగాధర్ తిలక్, దీపక్ చోదరి, కొత్తా సీతారాములు, ఎండీ.ముస్తఫా, చోటే బాబా, వద్దెబోయిన నరసింహారావు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page