పోలీస్ కుటుంబాల ఆధ్వర్యంలో ఘనంగా సెమి క్రిస్టమస్ వేడుకలు

Spread the love

Grand semi-christmas celebrations under the leadership of police families

పోలీస్ కుటుంబాల ఆధ్వర్యంలో ఘనంగా సెమి క్రిస్టమస్ వేడుకలు

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్ :

ప్రతి ఒక్కరూ దయాగుణంతో మెలగాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ అన్నారు. పోలీస్ విభాగంలోని పోలీస్ కుటుంబాల ఆధ్వర్యంలో సెమి క్రిస్టమస్ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. పోలీస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుటుంబ సమేతంగా హాజరైన పోలీస్ కమిషనర్ ,ఆయన సతీమణి హృదయ్ మేనన్ సెమీ క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి వేడుకలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఈనెల 25న నిర్వహించే క్రిస్టమస్ పండుగను క్రైస్తవ సోదరులు, సోదరీమణులు ఆనందోత్సవాలతో ఘనంగా నిర్వహించుకోవాలని, వారి కుటుంబాల్లో పండుగ వెలుగులు నిండలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు.


యేసుక్రీస్తు ప్రేమ, దయ, కరుణకు ప్రతిరూపమని,ప్రపంచ యావత్తు ఘనంగా సెమి క్రిస్టమస్ వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యాన్ని వ్యాఖ్యాత ఫాస్టర్ సైమన్ వివరించారు.


కార్యక్రమంలో అడిషనల్ డిసిపి సుభాష్ చంద్ర బోస్, ఏ ఎస్ పి అంక్షాశ్ యాదవ్, ఏస్ బి ఎ సి పి ప్రసన్న కుమార్ , భస్వారెడ్డి, రవి, విజయబాబు, ఏ ఓ అక్తరూనీసా బేగం, కమ్యూనికేషన్స్ ఇన్స్‌పెక్టర్ కృపనీరాజ, సిఐలు చిట్టిబాబు ,సర్వయ్య, సత్యనారాయణ రెడ్డి , రామకృష్ణ ,అంజలి,తుమ్మ గోపి, మల్లయ్య స్వామి, అర్ ఐ లు , శ్రీనివాస్ ,రవి, తితుపతి, శ్రీశైలం, నిర్వహులు ఏ అర్ ఏస్ ఐ లు మోహన్ రావు, హక్కులు, సుందర్ రావు, రఘు, నాగరాజు, జైరామ్ , మనోహర్, నోవా, రాంబాబు, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page