రవీందర్ కి మంజూరైన స్విఫ్ట్ డిజైర్ కార్ ను మాజీ కార్పొరేటర్ శ్రీ సాయి బాబా తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరేకపూడి గాంధీ .

Spread the love

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి వికర్ సెక్షన్ కి చెందిన శ్రీ రవీందర్ కి మంజూరైన స్విఫ్ట్ డిజైర్ కార్ ను మాజీ కార్పొరేటర్ శ్రీ సాయి బాబా తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరేకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ గారు మాట్లాడుతూ దశల వారిగా దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలు అవుతుంది అని , ఈ సంవత్సరంలో 2000 మంది లబ్ధిదారులకు అవకాశం కలిపిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు దళిత బంధావుడు అని ,దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, దళితులలో ద్విగుణీకృత మార్పు తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం అమలు లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారుల ఎంపికలో భాగంగా మన శేరిలింగంపల్లి నియోజవర్గంలో దళిత బంధు పథకం అమలు లో భాగంగా 100 మంది లబ్ధిదారులతో దళిత బంధు పథకం మార్గదర్శకాలు మరియు విధి విధానాల పై అవగహన కార్యక్రమం గతంలో నిర్వహించడం జరిగినది అని , ఈ రోజు ఎంపికైన లబ్ధిదారులకు మంజూరైన వాహనాలను లబ్ధిదారులకు అందించడం చాలా సంతోషకరమైన విషయం అని,లబ్ధిదారులను శాలవ తో సత్కరించడం జరిగినది , వారు ఎన్నుకున్న రంగాలలో మరింత ఉన్నతి సాధించాలని వారి కుటుంబాలలో వెలుగులు నిండాలని ఆశిస్తున్నాను అని ప్రభుత్వ విప్ గాంధీ గారు ఆకాంక్షించారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి మానసపుత్రిక అయిన దళిత బంధు పథకం ద్వారా దళిత కుటుంబాలలో ఆర్థిక ,సామాజిక అసమానతలు రూపు మాపి వారి జీవితాలలో కొత్త వెలుగులు నింపినవారు అవుతామని, వారి కాలి పై వారు సగర్వంగా తలెత్తుకొని జీవించేలా ఆర్థిక పరిపుష్టి కలిగేలా ఈ పథకం తోడ్పడుతుంది అని , దళిత కుటుంబాల సంక్షేమానికి కట్టుబడిన దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు అని , ఈ 100 మంది లబ్ధిదారులు భవిష్యత్తులో మిగతా వారికి ఆదర్శంగా నిలిచేలా ఉండలని, పక్క ప్రణాళిక తో యూనిట్లను నెలకొల్పి భావి తరాలకు ఆదర్శంగా నిలవాలని ,ఈ పథకం ను సద్వినియోగ పర్చుకోవలని, లబ్ధిదారులను గుర్తించి వారి కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కలిపించే విధంగా సహకరించాలని కొరినారు. అదేవిధంగా వ్యాపార యూనిట్లను వివరించామని ,వారికి నచ్చిన యూనిట్లు నెలకొల్పి ఆర్థిక ,సామాజిక సాధికారికత సాధించాలని, ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో పథకం అమలు పర్చేవిధంగా పథకం అమలు కార్యచరణ, పర్యవేక్షణ ఉండేలా చూడలని ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు. దళిత బంధు పథకం అమలు లో లబ్ధిదారులకు సలహాలు ,సూచనలు ఇవ్వడం జరిగినది అని అధికారుల సహకారం తో ముందుకు వెళ్లాలని, అధికారులు ఎల్లవేలలో అందుబాటులో ఉంటారని ,దశల వారిగా దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలు అవుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా దళిత బంధు పథకం కింద కార్ ను పొందిన లబ్ధిదారురాలు మాట్లాడుతూ దినసరి కూలి నుండి కార్ ఓనర్ గా మార్చిన సంధర్భంగా స్వీట్లు పంచుతూ, హర్షం వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారికి ,గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గార్ల కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు తెరాస నాయకులు సురేందర్,విష్ణు వర్ధన్ రెడ్డి, రమేష్,అనిల్,రాజేందర్, జితేందర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page