శ్రీనివాస్ నగర్ లో బీజేపీ జెండా ఆవిష్కరణ లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Spread the love

Former MLA Koona Srisailam Goud participated in the unveiling of the BJP flag in Srinivas Nagar

శ్రీనివాస్ నగర్ లో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: బీజేపీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా జగద్గిరిగుట్ట డివిజన్ లోని శ్రీనివాస్ నగర్ లాస్ట్ బస్టాప్ వద్ద బీజేపీ డివిజన్ అధ్యక్షులు పున్నా రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ , సీనియర్ నాయకులు మల్లారెడ్డి తో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అనేక ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతుంటే, కలెక్టర్, ఆర్డీవో ఆదేశాల మేరకు ఎంత మంది కబ్జాదారులపై కేసులు నమోదు చేసారో పోలీసులు చెప్పాలన్నారు. ముద్ర వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు పిలిపునిచ్చారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసి కుత్బుల్లాపూర్ లో కాషాయ జెండా ఎగరేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గసభ్యులు శేఖర్ యాదవ్, నాయకులు మోతే శ్రీనివాస్, సురేష్ రెడ్డి, సిద్ది రాంరెడ్డి, అరికెల సుధా, అరుణ రెడ్డి, వసుంధర, పత్తి రఘుపతి, పరశురామ్, అరుణ్, నర్సింగ్ గౌడ్, రాజమ్మ, రాజు యాదవ్, మురళి గౌడ్, పడాల సత్యనారాయణ, సాంబయ్య, మణి గౌడ్, మల్లారెడ్డి, మనోహార్, రంగ, సీతారాం, గణేష్, భాగ్యలక్ష్మి పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page