ప్రజాసేవకై ఉదయించిన తొలిపొద్దు..

Spread the love

Early morning for public service..

ప్రజాసేవకై ఉదయించిన తొలిపొద్దు..

మానకొండూర్ మండలంలో ఎమ్మెల్యే డా.రసమయి తొలిపొద్దు పర్యటన..

జనహృదయా నేత, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ తొలిపొద్దు పర్యటనలో భాగంగా, బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మరియు సుడా చైర్మెన్ .జీవి. రామకృష్ణారావు తో కలిసి మానకొండూర్ మండలంలో పర్యటించారు

సూర్యుడు సైతం ఉదయించక ముందే వేకువ జామున రంగపేట గ్రామంలో ప్రారంభమైన ఆయన పర్యటన మద్యాహ్నం 12 గంటల వరకు కెల్లేడు, మద్దికుంట, పోచంపల్లి, లలితాపూర్, మానకొండూర్ గ్రామాలలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమయ్యారు

రసమయి లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి కళ్యాణాలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేస్తూ, తల్లులకు చెక్కులు, ఆడ బిడ్డలకు చీరలను అందజేస్తూ, ముఖ్య మంత్రి కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాల ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు

ఈ సంధర్బంగా ఆయా గ్రామాల ప్రజలు తమ అభిమాన నాయకుడు ఎమ్మెల్యే రసమయి కి నుదుట తిలకం దిద్దుతూ, పూలమాలలు వేస్తూ, శాలువాలతో సత్కరిస్తూ ఘనస్వాగతం పలికారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page