నవ్యాంధ్ర అభివృద్ధి టిడిపి చంద్రబాబు తోనే సాధ్యం

Spread the love

Development of Navyandhra is possible only with Chandrababu TDP

నవ్యాంధ్ర అభివృద్ధి టిడిపి చంద్రబాబు తోనే సాధ్యం టిడిపి లో చేరిన కొర్రపాటి సురేష్ :ఇటీవల కన్నా లక్ష్మి నారాయణ తో పాటు బిజెపికి రాజీనామా చేసిన కొర్రపాటి సురేష్ నిన్న కన్నా లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా టిడిపి లో చేరిన కొర్రపాటి సురేష్ మాట్లాడుతూ వైకపా అధ్యక్షులు జగన్మోహనరెడ్డి ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ సంక్షేమ పథకాలు పూర్తిగా కాలరాసి చిల్లర పథకాలను నవరత్నాలనే పేరుతో అమలు చేస్తూ ఆ పథకాల కోసమే ఎదురు చూసే బానిసలుగా చేస్తున్నారని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం నుండి వేల కోట్లు తీసుకొచ్చి స్వయం ఉపాధి పథకాలతో అభివృద్ధికి బాటలు వేశారని.

అంబేద్కర్ పేదలకు ఇచ్చిన రాజ్యాంగ ప్రతిఫలాలు అందాలంటే అమరావతి రాజధాని అభివృద్ధి చెంది అన్ని సామాజిక వర్గాలకు ప్రాంతాలకు న్యాయం జరగాలంటే రాష్ట్రంలో ప్రజలకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం తెలుగుదేశం పార్టీయే నని కక్ష సాధింపులు పగలు ప్రతీకాలు పక్కన పెట్టి 5కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం భావితరాల భవిష్యత్తు కోసం కన్నా తీసుకున్న నిర్ణయం హర్షమని.రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అవలంబిస్తున్న వైసిపిని ఓడించి చంద్రబాబు నాయకత్వంలో సుపరిపాలన అందించే దిశగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని కొర్రపాటి సురేష్ తెలిపారు

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page