పాడి రైతుకు ఆర్థిక సహాయం అందజేసిన కౌన్సిలర్లు.

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపాలిటీ దుండిగల్ గ్రామానికి చెందిన పిట్ల శంకర్ గేదెలు ఇటీవల కరెంట్ షాక్ కు గురై మృతి చెందాయి. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపుర్ రాజు సహకారంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఅర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ వారికి లక్ష రూపాయలను అందజేశారు..


ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జక్కుల క్రిష్ణ యాదవ్, గోపాల్ రెడ్డి, ఆనంద్ కుమార్, భరత్ కుమార్, పాక్స్ డైరెక్టర్ వెంకటేష్, బీఅర్ఎస్ పార్టీ మునిసిపల్ జనరల్ సెక్రెటరీ కొల్తూర్ మల్లేష్ ముదిరాజ్, నాయకులు జక్కుల శ్రీనివాస్ యాదవ్, ప్రేమ కుమార్, నాగరాజు 3వ వార్డు ప్రెసిడెంట్ నర్సింగ్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page