సీఎం సహాయ నిధి నిరుపేదలకు భరోసా…

Spread the love

CM’s Relief Fund provides assurance to the poor…

సీఎం సహాయ నిధి నిరుపేదలకు భరోసా…

పథకం ద్వారా వేలాది మందికి ఆర్థిక చేయూతనందిస్తున్నాం…

అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి…

రూ.38 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 55 మంది నిరుపేదలకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా రూ.38,17,000/- విలువ చేసే చెక్కులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి చింతల్ లోని తన కార్యాలయం వద్ద అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రతీ యేటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం సంతోషంగా ఉందని తెలిపారు.

సీఎం సహాయ నిధి నిరుపేదలకు భరోసానిస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page