సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయండి:జెడ్పీ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్

Spread the love

22న పటాన్చెరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విచ్చేస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు జడ్పీ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్ పిలుపునిచ్చారు.బుధవారం ఏర్పాటు చేసిన పత్రిక సమావేశం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ముఖ్యమంత్రి కేసీఆర్ విచేస్తున్న సందర్భంగా వారికి ఘన స్వాగతం తెలపాలని నాయకులు, కార్యకర్తలకు తెలిపారు.

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నాయకత్వంలో పటాన్చేరు నియోజకవర్గం అభివృద్ధిలో ముందు వరుసలో ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిపాల్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.జిన్నారం మండల నాయికోటి రాజేష్ మాట్లాడుతూ జిన్నారం మండలం నుండి పెద్ద ఎత్తున తరలివెళ్లి సీఎం కేసీఆర్ పర్యటను జయప్రదం చేయాలని కార్యకర్తలను కోరారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్,సర్పంచులు శివరాజ్, సత్యనారాయణ నాయకులు కృష్ణ, జీవన్, నరేందర్,బత్తుల మహేష్ మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు,గ్రామ అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page