బంజారాహిల్స్ లో బాబు జగ్జీవన్ రామ్ భవన్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Spread the love

దేశంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో సంస్కరణలకు కృషి చేశారు.

రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన గాంధీ కుటుంబంతో, కాంగ్రెస్ పార్టీతో కొనసాగారు.

జగ్జీవన్ రామ్ స్పూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది.

గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు విడి విడిగా ఉండేవి..

దళితులు, గిరిజనులు, బీసీ మైనార్టీలందరికీ ఒకేచోట ఇందిరమ్మ ఇండ్లు కేటాయించేలా అధికారులను ఆదేశించాం

ప్రతీ నియోజకవర్గంలో ఒకే క్యాంపస్ లో గురుకులాలన్నీ ఉండేలా ఏర్పాటు చేసి కులాల మధ్య అంతరాలు చేరిపేయాలనుకుంటున్నాం.

పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ లో శంకుస్థాపన చేసాం..

చదువుమీద పెట్టేది ఖర్చు కాదు.. పెట్టుబడి..

చదువుకుంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.

ఆరెస్ ప్రవీణ్ కుమార్, ఆకునూరి మురళి లాంటి వారికి చదువుకుంటేనే గుర్తింపు, గౌరవం వచ్చాయి.

లోక్ సభ స్పీకర్ గా తెలంగాణ బిల్లును ఆమోదించింది జగ్జీవన్ రామ్ కూతురు మీరాకుమారి.

తెలంగాణ రాష్ట్రమంతా మీరా కుమారిని ఎప్పుడూ గుర్తుచేసుకుంటుంది.

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఒకసారి దొరల చేతిలో ఉంటే.. ఒకసారి దళితుల చేతుల్లో ఉంటుంది.

దొరలకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇవాళ అసెంబ్లీలో గడ్డం ప్రసాద్ ని అధ్యక్షా అని పిలవాల్సిందే..

కొందరు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు… అసలు ఆ ప్రశ్నించే హక్కును, అధికారాన్ని కల్పించింది కాంగ్రెస్ పార్టీనే..

చదువును ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దు… చదువే లక్ష్యంగా పెట్టుకుని ఉన్నత శిఖరాలకు ఎడగండి

Related Posts

You cannot copy content of this page