ప్రజాహిత యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందని భాజపా ఎంపీ బండి సంజయ్‌ అన్నారు

Spread the love

సాక్షిత హుజూరాబాద్‌: ప్రజాహిత యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందని భాజపా ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. హుజూరాబాద్‌లోని శాయంపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో భాజపాకు 350కి పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటామనే నమ్మకం ఉందన్నారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్, రామగుండం రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణశాఖ భూములివ్వడం హర్షణీయమన్నారు.


‘‘ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలుచేసి తీరాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉంది. తెల్ల రేషన్ కార్డు ఉన్నా.. రూ.500కు గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలులో కోత పెడుతున్నారు. 90 లక్షల వరకు రేషన్ కార్డు కుటుంబాలుంటే.. వాటిలో 50 లక్షల కుటుంబాలకు కోత పెట్టడం అన్యాయం. కాంగ్రెస్, భారాస కుమ్మక్కై దొంగాట ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు జరిగాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కాగ్, విజిలెన్స్ సంస్థలు తేల్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?’’ అని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

Related Posts

You cannot copy content of this page