రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితకుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా…

Spread the love

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితకుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా…

చెక్కును అందజేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్, మల్కాజిగిరి పార్లమెంట్ ఇంఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ తాండ-1కు చెందిన మాలోతు రాజు ప్రైవేట్ కార్ డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. విధులు ముగించుకొని బైక్ పై ఇంటికి వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కాగా బీఆర్టీయు అనుబంధ టాక్సీసెక్టార్, డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు, మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును ఈరోజు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో టాక్సీ సెక్టార్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అత్తిన మొని నాగేష్ కుమార్, కంటోన్మెంట్ మాజీ బోర్డ్ సభ్యుడు పాండు యాదవ్, జాయింట్ సెక్రెటరీ జిల్లెల్ల మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు నరేష్, సిసీడిఏ కిరణ్, ప్రమోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page