మీ తో నడుస్తా.. అందరికీ అండగా నిలుస్తా..

Spread the love

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి
తెల్లవారుజామునుంచే పటేల్ స్టేడియం లో వాకర్లతో కలిసి ప్రచారం షురూ..
సాక్షిత ఖమ్మం: అపుడే తెలతెలవారుతుండగా..మెడలో కాంగ్రెస్ కండువా వేసుకుని..అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. వాకర్లతో అడుగులేస్తూ..క్రికెట్ క్రీడాకారులతో కలిసి కాసేపు బ్యాటింగ్ చేసి..ఉత్సాహం నింపారు. ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోయారు రఘు రాం రెడ్డి.
సీపీఐ, సీపీఎం బలపర్చిన కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి ఉదయం 6 గంటల నుంచే ప్రచార పర్వం మొదలెట్టారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువాళ్ల దుర్గాప్రసాద్, సీనియర్ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, మువ్వా విజయ బాబు, నిరంజన్ రెడ్డి లతో కలిసి నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియానికి చేరుకున్నారు.

అక్కడ వాకింగ్ చేస్తున్న వారితో కలిసి ..ముందుకు నడుస్తూ.. అక్కా, అన్నా అంటూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. హస్తం గుర్తుపై ఓటేసి.. తనను భారీ మెజారిటీ తో గెలిపించాలని అభ్యర్థించారు. మైదానంలో క్రీడాకారులతో కలిసి కాసేపు క్రికెట్ ఆడి, ఇండోర్ షటిల్ కోర్టులో గేమ్ ఆడి అందరినీ ఉత్సాహ పరిచారు. మైదానం లో సీపీఎం సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, సుబ్బారావు తదితరులు ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రఘురాం రెడ్డి వాకర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రజాసేవకే పోటీ చేస్తున్నానని, అందరికీ అండగా ఉండాలని అభయమిచ్చారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నగర అధ్యక్షులు మొహమ్మద్ జావిద్, కార్పొరేటర్లు చావా నారాయణ, మిక్కిలినేని మంజుల నరేందర్, నాయకులు కొత్త సీతారాములు, కొప్పుల చంద్రశేఖర రావు, మద్ది కిషోర్ రెడ్డి, హుస్సేన్, వడ్డెబోయిన శ్రీనివాస్, నెల్లూరు చంద్రయ్య, వాకర్స్ క్లబ్ బాధ్యులు మలీదు నాగేశ్వరరావు, కేతినేని కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page