కొండకల్ గ్రామంలో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం….. విజయం వైపు దూసుకెళ్తున్న హస్తం…

Spread the love

శంకర్ పల్లీ మండలం కొండకల్ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల గడపగడప ప్రచారంలో భాగంగా చేవెళ్ల అసెంబ్లీ ఇన్చార్జ్ శ్రీ పామేనా భీమ భరత్ ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను మరియు గ్రామ ప్రజలను కార్యకర్తలను నాయకులను ఉద్దేశించి..,……

ఈ సారి ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్రం లో మాదిరిగానే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ విజయ కేతనం ఎగరేస్తున్న నేపథ్యం లో అత్యంత భారీ మెజారిటీ తో చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ని పార్లమెంట్ కు పంపాల్సిన బాధ్యత ను ప్రతి కాంగ్రెస్ అభిమాని, కార్యకర్త, నాయకులు తీసుకోవాలని పిలుపు నిచ్చారు.గత పదేళ్లుగా ప్రజలను దోచుకున్న దుష్ట బీజేపీ పాలనను గద్దె దించి ప్రజా శ్రేయస్సు కోరే కాంగ్రెస్ కు ప్రజలు అధికారం కట్ట బెట్టడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యం లో ప్రతి కార్య కర్త ప్రజల్లోకి వెళ్లి తెలంగాణ లో అధికారం లోకి వచ్చిన మూడు నెలల నుంచి జరుగు తున్న సంక్షేమ పరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరి విలువైన ఓటును కాంగ్రెస్ వైపు మల్లించే దిశగా కటపడి పనిచేయాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. గత డెబ్బై ఏళ్ల లో కాంగ్రెస్ చేసిన అభివృద్ది ని సంక్షేమాన్ని నాశనం చేసి దేశాన్ని దివాళా తీయించిన బీజేపీ దుష్ట పాలనను అంత మొందించి , ప్రజా సంక్షేమ అభివృద్ధి కోసం పాటుపడే కాంగ్రెస్ కు అధికారం లోకి తీసుకుని రావాలని పిలుపు నిచ్చారు. కొండకల్ గ్రామ మాజీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మండల రమేష్ కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల అసెంబ్లీ ఇంచార్జ్ భీమ భరత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు సభ్యులు సత్య నారాయణ రెడ్డి , రాష్ట్ర నాయకులు ఉదయ్ మోహన్ రెడ్డి , మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి , కొండకల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామలక్ష్మన్, సర్పంచ్ లావణ్య కాశీనాథ్ గౌడ్, మహేందర్ రెడ్డి, కొండకల్ గ్రామ యూత్ ప్రెసిడెంట్ వెంకట్ రాజు, మన్నె నర్సింలు, దయాకర్ రెడ్డి, మోత్కుపల్లి మహిపాల్, శ్రీకాంత్, హుస్సేన్, చిన్న, ప్రశాంత్, స్థానిక నాయకులు, సీనియర్ నాయకులు ,మహిళా నాయకురాలు బి బ్లాక్. అధ్యక్షులు ,కార్యకర్తలు, అభిమానులు,గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసారు…..

Related Posts

You cannot copy content of this page