తిరుమల నడక భక్తులకు అన్నధానం

Spread the love

తిరుపతికి నడిచే వెల్లే భక్తులకు, స్థానిక భక్తులకు పెరటాసి మాసం మూడవ సందర్భంగా తిరుపతి సరోజిని దేవి రోడ్డులోని సీతారామాంజనేయ స్వామి ఆలయం నందు అన్నధాన కార్యక్రమం నిర్వహించినట్లు తిరుపతి నగరపాలక సంస్థ రెవెన్యూ ఆఫిసర్ కె.ఎల్.వర్మ తెలిపారు. పవిత్ర పెరటాసి మాసంలో వచ్చే శనివారాల్లో అన్నధానం నిర్వహిస్తామని, ముఖ్యంగా తిరుమల స్వామి వారిని దర్శించుకునేందుకు నడక ద్వారా వచ్చే భక్తులకు అన్న ప్రసాదాలను అందించడం సంతోషంగా వుంటుందన్నారు.

మూడవ శనివారం సందర్భంగా నిర్వహించిన అన్నధాన కార్యక్రమంలో తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పాల్గొని తమను ప్రోత్సహించడం జరిగిందని కె.ఎల్.వర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణ, ట్రెక్కింగ్ బాలు, ఆర్.ఆర్.శ్రీనివాస్, రాధాకృష్ణ వర్మ, జయచంధ్ర, పాయ్ వైస్రాయ్ మేనేజర్ మదన్మోహన్, మురళీ, అనంతవీధి సత్య తదితరులు పాల్గొన్నారు.*

Print Friendly, PDF & Email

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page