గోల్డ్ మెడల్ సాధించిన సత్యసాయిడిగ్రీకళాశాల విద్యార్ధిని

Spread the love

గోల్డ్ మెడల్ సాధించిన సత్యసాయిడిగ్రీకళాశాల విద్యార్ధిని సన్మానించిన జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్

గద్వాల:-పాలమూరువిశ్వావిద్యాలయ పరిధిలో నాల్గవ కాన్వాకేషన్ లో బి.ఎస్సి విభాగంలోశ్రీసత్యసాయి డిగ్రీమరియుపిజీకళాశాల విద్యార్ధిని రుక్షానా బేగం ఆరు సెమిస్టర్లలో కలిపి (94) పెర్సెంటేజ్ మార్కులు సాధించి గోల్డుమెడల్,సాధించింది పాలమూరుయూనివర్సిటీపరిధిలోనీనూరు(100) కళాశాలల నుంచి ఈ అమ్మాయి అత్యధిక పెర్సెంటేజ్, మార్కులు సాధించినందుకు గాను జోగులాంబ జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్ విద్యార్థిని కలెక్టర్ కార్యాలయంలో సన్మానించారు.

ఈ అమ్మాయి త్వరలో యూనివర్సిటీలో జరిగే ఫోర్త్,కన్వకేషన్,ప్రోగ్రాములో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా గోల్డుమెడల్ అందుకోబోతుంది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ…గోల్డుమెడల్ సాధించినందుకు అభినందిస్తూ సివిల్స్ పై దృష్టిసారించాలని సూచించడం జరిగింది. కళాశాలస్థాపించినఅనతి కాలంలోనే కళాశాల కీర్తిప్రతిష్టలుపెంచినందుకుకళాశాలకరెస్పాండంట్ మాకం బీచుపల్లి, సత్యసాయిడిగ్రీమరియు పిజీ కళాశాల ప్రిన్సిపల్ మాకం వినీలబాలరాజు, వైస్ప్రిన్సిపాల్,నర్సింహులు, కళాశాల అధ్యాపక బృందం జ్యోతి, సునీత, శారద, ఖయుమ్,అనిల్, అర్షియా, పారిజాత, తదితరులుపాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page