రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టిన లారీ

Spread the love

చక్రాల కింద పడి అక్కడికక్కడే మహిళ మృతి

నార్కట్పల్లి సాక్షిత ప్రతినిధి

నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామ శివారులోని రహదారిపై మహిళ రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. నార్కట్పల్లి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన బొడ్డు రమణ ఎల్లారెడ్డిగూడెం గ్రామ సమీపంలో ఉన్న గురుకుల పాఠశాలలో చదువుతున్న తన కుమారుడిని చూడడానికి సంవత్సరం వయసున్న కూతురు ని తీసుకుని వచ్చింది. అనంతరం తిరిగి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా
హర్యానకి చెందిన కంటైనర్ లారీ ఢీకొట్టడంతో మహిళ లారీ చక్రాల కింద పడతంతో అక్కడికక్కడే మరణించడం జరిగింది. పాపకి స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది.
మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్.ఐ సైదాబాబు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఒక పాప ఉన్నట్లు సమాచారం.

Related Posts

You cannot copy content of this page