లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి సమస్య శాశ్వత పరిష్కారం దిశగా 3 కోట్ల రూపాయల నిధులతో త్వరలోనే పనులు చేపడుతాం.

Spread the love

మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం సమస్య పరిష్కారం చేసి చూపెడుతాం ప్రభుత్వ విప్ గాంధీ

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచిపోవడం తో హుటాహుటిన అక్కడికి వెళ్లి సమస్య పరిష్కరనికై తీసుకోవాల్సిన చర్యల పై జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి , కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మరియు GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారుల తో కలిసి పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ వర్షం పడుతున్న ప్రతి సారి లింగంపల్లి అండర్ బ్రిడ్జి నీటితో నిండి పోవడం వలన పరిసర ప్రాంత ప్రజలకు, వాహన దారులకు ,ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అని,ఈ సమస్యను పరిగణలోకి తీసుకుని శాశ్వత పరిష్కారం చేపట్టడానికి గాను ,శాశ్వత పరిష్కారం దిశగా అండర్ బ్రిడ్జి నుండి నాల విస్తరణ పనులు చేపడుతామని నాల విస్తరణ కు 3 కోట్ల రూపాయల నిధుల ప్రతిపాదనలు పంపడం జరిగినది. నిధులు మంజూరి కాగానే పనులు ప్రారంభిస్తామని త్వరలోనే పనులు చేపడుతామని ,నాల విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, ముంపు సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, శాశ్వత ప్రాతిపదికన పనులు చేపడుతామని, అనుసరించాల్సిన విధానాలపై అధికారుల తో చర్చించడం జరిగినది అని, సాకేతిక కారణాలతో, మంజీర పైప్ లైన్ ఉండటం వంటి అంశాలను పరిగణలోకి సర్వే లు చేపట్టి పనులు పూర్తి చేస్తామని GHMC ఇంజనీరింగ్ మరియు జలమండలి అధికారులు సమన్వయంతో పనిచేయాలని, సమస్య పరిష్కరినికి కృషి చేయాలని , త్వరలోనే సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి ని తొలగించాలని, ఎప్పటికప్పుడు నీటి ప్రవాహం ను తొలగించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడలని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహన దారులకు సుఖ ప్రయాణానికి బాటలు వేయాలని,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ గారు అధికారులను ఆదేశించారు. అదేవిధంగా
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖల యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రజలకు అందుబాటులో ఉండలని అధికారులకు తెలియచేసిన ప్రభుత్వ విప్ గాంధీ .
వర్షకాలం దృష్ట్యా ముంపు ప్రాంతాలు మునిగిపోకుండా ముందస్తు చర్యలో భాగంగా అన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని, మాన్ సున్ ,ఎమర్జెన్సీ టీమ్స్ లు అన్ని పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని, ప్రజలకు అందుబాటులో ఉండలని, ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లి పరిష్కరించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని, , ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని, అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు అదేవిధంగా అండర్ బ్రిడ్జి కింద నాలలో కూరుకుపోయిన చెత్త చెదరాంను తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడలని ,మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలనీ, నాలలకు రక్షణ చర్యలలో భాగంగా ఫెన్సింగ్ వేయాలని, రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, నాల మరియు ముంపు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండలని ,తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ అధికారులకు తెలియచేసారు. అదేవిదంగా వర్షకాలం ను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని,పెండింగ్ పనులలో ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలనీ చెప్పడం జరిగినది .గత వర్షాకాలంలో నాలా పొంగి ప్రవహించడం ద్వారా ఇండ్లలోకి నీరు ప్రవహించి ,పరిసరాలు నీటమునిగిన పరిస్థితి  విదితమే దీనిని దృష్టిలో పెట్టుకొని మళ్లీ పునరావృతం కాకుండా పనులు చేపట్టామని ,నాలా లో పేరుకుపోయిన చెత్త, మట్టిని  పూడిక తీత ద్వారా తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా  ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడలని, అధికారులు తెలియచేసారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో ,మంత్రికేటీఆర్ సహకారం తో శేరిలింగంపల్లి లో అనేక రోడ్లు, లింక్ రోడ్లు, ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ లు నిర్మించి ప్రజలకు సుఖవంతమైన ట్రాఫిక్ రహిత సమాజాం కోసం కృషి చేశామని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.

గతంలో వర్షాలు పడితే శేరిలింగంపల్లి లో దీప్తి శ్రీ నగర్,ధరణి నగర్, మాదాపూర్ సిటీ వైన్స్ వద్ద నాలల పై నిత్యం వార్తలు వచ్చేవి,కానీ నేడు ఒక్క వార్త రాలేదు అంటే మా నిబద్ధతతో పనిచేమని అర్థం, అన్ని ప్రాంతాలను దశల వారిగా నాలల విస్తరణ చేపట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశామని, నేడు ఆ ప్రాంతాలలో ఇబ్బంది లేకుండా చేశామాని, ఈ లింగంపల్లి అండర్ బ్రిడ్జి సంస్యను కూడా త్వరలోనే శాశ్వత పరిష్కారం చేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. ప్రతిపక్ష పార్టీల వారు విమర్శలు చేయకుండా మంచి సూచనలు సలహాలు ఇస్తే ప్రజలు హర్షిస్తారు అని ,ఆపదలో సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్ గాంధీ హితం పలికారు.

అదేవిధంగా ప్రజలు అందరు వర్షకాలంను దృష్టిలో పెట్టుకొని అప్రమాత్రంగా ఉండలని, అత్యవసర పరిస్థితి తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దు అని,ప్రతి ఒక్కరు కనీస స్వీయ రక్షణ చర్యలు పాటించాలని, భారీ వానల నేపథ్యంలో అనవసరంగా రిస్కు తీసుకోవద్దని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెల్లకుండా వుండాలని, తగు స్వీయ జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ విజ్జప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో GHMC అధికారులు SE శంకర్ నాయక్, EE శ్రీనివాస్, EE శ్రీకాంతిని,DE రమేష్, AE సునీల్, AE జగదీష్, AE సంతోష్ రెడ్డి మరియు మాజీ కౌన్సిలర్ విరేశం గౌడ్, చందానగర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి,మాదాపూర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుప్రజ ప్రవీణ్, పద్మారావు ,చింతకింది రవీందర్ గౌడ్,నటరాజు,గంగారాం యాదవ్, నర్సింహ రెడ్డి, గిరి,అప్సర్, దివ్య, నిరూప తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page