తాళ్లూరి దర్గయ్య మృతికి నివాళులర్పించిన తల్లాడ జర్నలిస్టులు

Spread the love
Talladah journalists paid tribute to the death of Talluri Dargayya

టీయూడబ్ల్యూజే(ఐజేయూ) సత్తుపల్లి డివిజన్ కమిటీ ఉపాధ్యక్షులు, పలు పత్రికల్లో విలేకరిగా విధులు నిర్వహించి అనారోగ్యంతో మృతిచెందిన తాళ్లూరి దర్గయ్యకు తల్లాడ జర్నలిస్టులు నివాళులు అర్పించారు.

అన్నారుగూడెం గ్రామంలో సీనియర్ పాత్రికేయులు ఎండి బహుదూర్, టీకే ప్రసన్నన్ ఆయన మృతికి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాప సానుభూతిని వ్యక్తం చేశారు.

దర్గయ్య కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు. నివాళులర్పించిన వారిలో జర్నలిస్టులు గొడ్ల బాబురావు, దేవబత్తిని సీతారాములు, వేము విజయ్, కొత్తపల్లి విజయ్, తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

Sakshitha News
Download app

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

Sakshitha Epaper
Download app

Talladah journalists paid tribute to the death of Talluri Dargayya

Related Posts

You cannot copy content of this page