రెట్టించిన వేగంతో పనిచేయాలి

Spread the love

రెట్టించిన వేగంతో పనిచేయాలి

సంవత్సరంలో మనం ఎన్నికలకు వెళ్తున్నాం

గడప గడపకూ కార్యక్రమానికి ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లాలి

ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్‌ చేసి మరీ విష ప్రచారం చేస్తున్నారు

సోషల్‌ మీడియాను బాగా వినియోగించుకోవాలి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

గుంటూరు : గడప గడపకు మన ప్రభుత్వం సమీక్షలో భాగంగా సోమవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ ఇన్‌ఛార్జిలు హాజరయ్యారు. గడపగడపకూ మన ప్రభుత్వంతో పాటు గృహసారథుల అంశాలపై ఈ సమావేశంలో సీఎం జగన్‌, పార్టీ శ్రేణులతో చర్చించారు. ఈ సమావేశంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ ఫిబ్రవరి 13న గడపగడపకూ కార్యక్రమం మీద రివ్యూ చేశాం. దాని తర్వాత కార్యక్రమానికి కాస్త గ్యాప్‌ వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా గ్యాప్‌ వచ్చింది. మార్చి 16వరకూ కోడ్‌ కొనసాగింది. తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. తర్వాత ఆసరా కార్యక్రమాలు మొదలయ్యాయి. దీని వల్ల గడపగడపకూ కాస్త గ్యాప్‌ వచ్చింది. మళ్లీ గడప గడపకూ కార్యక్రమానికి ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లాలి. గేర్‌ మార్చి రెట్టించిన స్పీడ్‌తో కార్యక్రమం చేయాలి. రాష్ట్ర చరిత్రే కాదు. దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా నాలుగు సంవత్సరాలు గడవక ముందే రూ.2లక్షల కోట్ల పైచిలుకు ఎలాంటి వివక్ష, లంచాలకు తావులేకుండా మన అక్క చెల్లెమ్మల కుటుంబాల అక్కౌంట్లో పడింది. అర్బన్‌ ప్రాంతంలో 84శాతం, రూరల్‌ ప్రాంతంలో 92 శాతం కుటుంబాలు, యావరేజీన 87శాతం కుటుంబాలకు మంచి చేయగలిగాం. ఇలా అండగా నిలబడ్డ పరిస్థితి ఎప్పుడూ జరగలేదు. 87శాతం కుటుంబాలను గమనించినట్టైతే అర్హులుగా ఉన్నవారిని చాలా పారదర్శకంగా గుర్తించి అమలు చేశాం. పేదవాడు మిస్‌కాకుండా వెరిఫికేషన్‌ చేసిన మరీ వారికి పథకాలు అందిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేల లోపు ఉన్న కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల లోపు ఉన్న కుటుంబాల్లో వారిని అర్హులుగా గుర్తించి పథకాలు ఇచ్చాం. బీపీఎల్‌ నిర్వచనాన్ని మారుస్తూ గ్రామీణ ప్రాంతాల్లో పరిమితిని రూ.10వేలకు, అర్బన్‌ ప్రాంతాల్లో రూ.12వేలకు పెంచి పథకాలు ఇచ్చాం. ఇలా చేస్తే 87శాతం ఇళ్లకు నేరుగా డీబీటీ ద్వారా బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తున్నాం. ఈ మధ్యకాలంలో కొన్ని పత్రికలూ, చంద్రబాబును చూసినా కొన్ని మాటలు మాట్లాడుతున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని ఏదో మాటలు చెప్తున్నారని సీఎం అన్నారు.

21 స్థానాల్లో ఎన్నికలు గెలిస్తే 17 స్థానాల్లో మనం గెలిచాం. మనం మారీచులతో యుద్ధంచేస్తున్నాం. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే ప్రచారం చేస్తున్నారు. కొన్ని వాస్తవాలు అందరికీ తెలియాలి. ఒక్క ఎమ్మెల్సీ స్థానం అంటే 34 నుంచి 39 నియోజకవర్గాల పరిధి. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటులో కనీసం 2.5 లక్షల మంది ఉంటారు. అంటే ఎమ్మెల్సీ స్థానం పరిధి దాదాపు 80 లక్షల ఓట్ల పరిధి ఉంటుంది. ఆ పరిధిలో 87శాతం అంటే అక్క చెల్లెమ్మల కుటుంబాలు, మన కుటుంబాలు ఉన్నాయి. అలాంటి 80 లక్షల కుటుంబాల్లో, కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదుచేసుకున్నారు. వీళ్లంతా రకరకాల యూనియన్లకు చెందినవారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లైన ఈ రెండున్నర లక్షల మంది ఓటర్లలో దాదాపు చాలా శాతం మంది డీబీటీలో లేనివారు, కేవలం 20శాతం మంది మాత్రమే డీబీటీలో ఉన్నవారు. ఇది ఏరకంగా రిప్రజెంటేటివ్‌ శాంపిల్‌ అవుతుంది. రాష్ట్రంలో ఎలక్టోరల్‌ రిప్రజెంటేటివ్‌ శాంపిల్‌ ఏదైతే.. ఉందో.. అది ఇది కాదు ఒకటో ప్రాధాన్యం.. రెండో ప్రాధాన్యం. మూడో ప్రాధాన్యాలు ఉన్నాయి. మిగిలిన పార్టీ అందరూ కలిశారు. మనం ఒక్కరిమే అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ మొదటి ప్రాధాన్యతతో గెలిచింది లేదు. ఇంతమంది ఏకం కావడంవల్ల, రెండో ప్రాధాన్యత ఓటు వారికి ఉందికాబట్టి జరిగింది. అయినా కూడా ఒక వాపును చూపించి అది బలం అని చూపిస్తున్నారు. దానికితోడు ఆ పత్రికలు రాయడం, టీవీలు చూపడం.. రాబోయే రోజుల్లో ఇంకా రూమర్లు ప్రచారం చేస్తారు. 60 మందికి టిక్కెట్లు ఇవ్వని లిస్టు కూడా తయారుచేస్తున్నారని చెప్తారు. ఇదే పనిగా పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఇంత కంటే దుర్మార్గమైన ఎమ్మెల్యేలు ఉండరని కూడా ప్రచారం చేస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్‌ చేసి మరీ విష ప్రచారం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. రూమర్లు వస్తున్నాయనే మాట మనకు తెలిసి ఉండాలి. వాటిని తిప్పికొట్టాలి. సంవత్సరంలో మనం ఎన్నికలకు వెళ్తున్నాం. కేడర్‌ అత్యంత క్రియాశీలకంగా ఉండాలి. సోషల్‌ మీడియాను బాగా వినియోగించుకోవాలి. సోషల్ మీడియాలో క్యాంపెయిన్‌ను ఉద్ధృతం చేసుకోవాలి. గృహసారథులను, సచివాలయ కన్వీనర్ల వ్యవస్థను పూర్తిచేసుకోవాలని కోరారు.

ప్రతి లబ్ధిదారును మన ప్రచారకర్తగా తయారుచేసుకోవాలని, వాలంటీర్లను, గృహసారథులను మమేకం చేయాలన్నారు. వీళ్లంతా ఒక్కటై ప్రతి ఇంటికీ మన ప్రభుత్వం చేస్తున్నమంచిని ప్రతికుటుంబానికీ తీసుకెళ్లాలని, దాదాపుగా ఇప్పటికి సగం సచివాలయాల్లో గడపగడపకూ పూర్తిచేశామని, ఈ సగం వచ్చే 5 నెలల్లో, అంటే ఆగస్టు నాటికి పూర్తిచేయాలన్నారు. నెలకు 9 సచివాలయాలను పూర్తిచేయాలని, నెలకు 25 రోజుల చొప్పున సచివాలయాల్లో తిరగాలని, సెప్టెంబరు నుంచి వేరే కార్యక్రమాలకు శ్రీకారం చుడదామన్నారు. ఒకవైపున గడపగడపకూ జరుగుతుంది. రెండోవైపున సచివాలయ కన్వీనర్లు, గృహసారధులతో మమేకం చేసే కార్యక్రమాలు ఉంటాయని, వీటికి పార్టీ పరంగా కార్యాచరణ చేస్తున్నామన్నారు. రాజకీయాల్లో నేను నాన్న దగ్గరనుంచి నేర్చుకున్న అంశం ఏంటంటే రాజకీయం అంటే మానవ సంబంధాలు. ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవాలని నేను అనుకోను. ఒక్క కార్యకర్తనూ కూడా పోగొట్టుకోవాలని అనుకోను. మీతో పనిచేయించి మిమ్మల్ని మళ్లీ గెలిపించాలనే ఈ కార్యక్రమాలు. ఈ అడుగులన్నీ కూడా దానికోసమేనని సీఎం జగన్ స్పష్టం చేశారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page