వాళ్లను, వీళ్లను కాదు ..ధైర్యం ఉంటే నన్ను సస్పెండ్ చేయండి.

Spread the love

They, not them ..if you dare suspend me.

వాళ్లను, వీళ్లను కాదు ..ధైర్యం ఉంటే నన్ను సస్పెండ్ చేయండి.

సభ్యత్వం లేకుంటే పార్టీ కార్యక్రమాల్లో నా ఫోటో ఎందుకు పెట్టారు.

గెలుపు కోసం నన్ను ప్రాధేయపడింది మరిచారా

పార్టీ మారడం ఖాయం.. కానీ తొందర నిర్ణయం తీసుకోను.

రాజకీయ నాయకుల మాటలు విని నా అభిమానులను ఇబ్బందికి గురిచేస్తే సహించను.

ఖమ్మం మాజి ఎంపీ పొంగులేటి

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

తన అనుచరులు కొందరిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లను, వీళ్లను సస్పెండ్ చేయడం కాదని… ధైర్యం తనను సస్పెండ్ చేయాలని ఆయన సవాల్ విసిరారు. తనను కొద్దిరోజుల క్రితం వరకు పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించారని ఆయన గుర్తు చేశారు. వారి గెలుపు కోసం నన్ను ప్రాధేయపడ్డారని అన్నారు. తనకు బీఆర్ఎస్ సభ్యత్వం లేదని ఎవరో అంటున్నారట అని వ్యాఖ్యానించిన పొంగులేటి.. అలాంటప్పుడు డిసెంబర్ వరకు పార్టీ కార్యక్రమాల్లో తన ఫోటో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. తనను నమ్ముకున్న అభిమానుల అభీష్టం మేరకే పార్టీ మార్పు ఉంటుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలోని నెమలిపేట గ్రౌండ్లో జరిగిన పొంగులేటి శీనన్న ఆత్మీయ సమ్మేళనంలో ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్‌ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు, గిరిజనులకు, ఏజెన్సీ గ్రామాల్లో ఉన్న గిరిజనేతరులకు ఇల్లు లేని వారికి ఎలాంటి లాభం చేకూరలేదని, అక్కడక్కడ పది, పదిహేను ఇళ్ళు కట్టి భూతద్దంలో చూపిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గురించి ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.


పోడు భూములకు, ఏజెన్సీలోని గిరిజనేతరులకు భూములకు పట్టాలిస్తామని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఊసే ఎత్తకపోవడం బాధాకరం అన్నారు. కనీసం గ్రామపంచాయితీలకు నిధులు ఏర్పాటు చేయకపోవడం, పెండింగ్ బిల్లులను విడుదల చేయకపోగా, మళ్ళీ ఒక్కో గ్రామపంచాయితీకి పది లక్షలు, మున్సిపాలిటికి రూ. 30 లక్షలు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు. సర్పంచ్‌లు తమ భార్యల మెడలో బంగారాన్ని తాకట్టు పెట్టి పంచాయితీలకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

పార్టీ మారడం ఖాయం.. కానీ తొందర నిర్ణయం తీసుకోను..
పార్టీ మారడంపై పొంగులేటి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం ఖాయమని.. కానీ తొందర నిర్ణయాలు తీసుకోనని తెలిపారు. తన కార్యకర్తల మెజారిటి నిర్ణయం ప్రకారమే తాను నిర్ణయం తీసుకుంటానని.. కొన్ని పత్రికలు, టీవీ ఛానెళ్ళలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ పార్టీలోకి.. ఈ తేదీన వెళ్తున్నారు.. ఆ పార్టీలోకి, ఆ తేదీన వెళ్తున్నారని వస్తున్న వార్తలు సంతోషకరమే కానీ, తన అభిమానులు ప్రకటించిన పార్టీనే, తేదీ నాడే తాను నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.


ప్రభుత్వ అధికారులకు హెచ్చరిక.
దమ్మపేట ఆత్మీయ సమ్మేళనంలో పలు ప్రభుత్వ అధికారులకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ నాయకులు చెప్పే మాటలు విని, తనను అభిమానించే నాయకులను ఇబ్బందికి గురిచేస్తే తనకు సమయం వచ్చిన నాడు వడ్డీ, చక్రపు వడ్డీతో పాటు తిరిగి చెల్లిస్తానని హెచ్చరించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page