తెలంగాణ మార్కెట్ కమిటీ సెక్యూరిటీ గార్డు ఆధర్యంలో రిజిస్టర్ పోస్ట్ ద్వారా తమ సమస్యను సీఎం దృష్టికి

Spread the love

నేలకొండపల్లి మండలం నుంచి శ్రీకారం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్యూరిటీ గార్డ్స్ కు వేతనాల పెంచాలని సీఎం కేసీఆర్ కు రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేఖలు రాశారు .ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు మారాగాని వీరబాబు మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ సెక్యూరిటీ గార్డ్స్ ను నియమించే థర్డ్ పార్టీ ఏజెన్సీలు రద్దుచేసి, నేరుగా కమిటీల ద్వారా జీతాలు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1200 మంది తమ లేఖలను రిజిస్టర్ పోస్టు ద్వారా సీఎం ఆఫీస్ కి పంపించడం జరిగింది ఈ కార్యక్రమంలో జి కాంతారావు ఎస్ వీరభద్రం , సాయికిరణ్, వెంకటనారాయణ, వసంతరావు, వి శ్రీనివాసరావు, సత్యనారాయణ సింగ్ ,ఎం శ్రీనివాసరావు,శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page