అందరికీ అండగా నిలుస్తాం..రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

Spread the love

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, ప్రజలందరికీ రఘురాం రెడ్డి అండగా నిలుస్తారని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం కవిరాజ్ నగర్ లో మహావిష్ణు బిల్డర్స్, కాంపాటి పిచ్చయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి తో కలిసి మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఖమ్మం సీటును, రాష్ట్రంలోని అన్ని సీట్లను గెలిపించుకొని సోనియమ్మకు కానుకగా ఇద్దాం అన్నారు. ఇందుకోసం నాయకులు విశేష ప్రచారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page