జిల్లా ఎస్పీ ఆదేశాలతో అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను తనిఖీ చేసిన అదనపు ఎస్పీ

Spread the love
  • చెక్ పోస్ట్ ల వద్ద పటిష్ట నిఘా… క్షుణ్ణంగా వాహనాలు తనిఖీ చేయాలని ఆదేశాలు

జిల్లా సరిహద్దుల్లో ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ IPS ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఆర్ విజయభాస్కర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కుందిర్పి మండలం బెస్తరపల్లి, కంబదూరు అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను విజిట్ చేశారు.

రానున్న ఎన్నికల దృష్ట్యా ఇప్పటి నుండే గట్టి నిఘా వేయాలని చెక్ పోస్టుల సిబ్బందికి సూచించారు. కర్నాటక నుండీ జిల్లాలోకి ప్రవేశించే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. కర్నాటక లిక్కర్ జిల్లాలోకి ప్రవేశించరాదన్నారు. బంగారు, నగదు, అక్రమంగా తరలించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదనపు ఎస్పీతో పాటు కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు, రూరల్ సి.ఐ నాగరాజు, తదితరులు వెళ్లారు.

Whatsapp Image 2024 01 31 At 11.52.39 Am

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page