ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జస్టిస్

Spread the love

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జస్టిస్ HRISHIKESH ROY కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారిని ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక రాహు కేతు పూజ అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు.

శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి తీర్థప్రసాదాలను అందజేశారు.
వేద పండితులు వేదమంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో ఏ.ఈఓ సతీష్ మల్లి పి.ఆర్.ఓ నాగభూషణం నాయక్* మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు‌.

Related Posts

You cannot copy content of this page