ఓబుళాపురంఎస్టీలకు పక్కాగృహాలునిర్మించడానికి

Spread the love

రెడ్డిగూడెం మండలంలోని ఓబుళాపురంలో ఎస్టీలకు పక్కాగృహాలు నిర్మించడానికి చర్యలు చేపట్టినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.

గతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఓబుళాపురం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ఇక్కడ గుడిసెల్లో నివసిస్తున్న యానాది కులస్తుల దుర్భర జీవితాన్ని చూసి చలించిపోయారు. వారికి ప్రభుత్వం నుంచి పక్కాగృహాలతో పాటు ఒక్కో గృహానికి రూ.25వేల ఆర్థికసాయాన్ని కూడా తన స్వంత నిధుల నుంచి ప్రకటించారు. దీనితో పాటు గిరిజన సంక్షేమ శాఖ నుంచి మరింత ఆర్థికసాయం మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.

ఇచ్చిన హామీని నెరవేర్చే క్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి రుక్మాంగదయ తో కలసి మంగళవారం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఓబుళాపురంలో పర్యటించారు. వారికి గిరిజన సంక్షేమ శాఖ నుంచి ఆర్థిక సాయం అందజేయాలని కోరారు. అతిత్వరలోనే ఇక్కడ నివసిస్తున్న ఎస్టీలకు పక్కాగృహాలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు

Related Posts

You cannot copy content of this page