ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్.

Spread the love

ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్.

సాక్షిత : విజయవాడ నగర శివారు వడ్డేశ్వరంలోని ప్రముఖ కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ నందు అభ్యసించిన విద్యార్థి విద్యార్థులు వివిధ బహుళజాతి సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు పొందిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జోగి రమేష్ పాల్గొని ప్రసంగించారు.*

ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ గారు మాట్లాడుతూ కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీకి రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరు ఉందని ఇక్కడ చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ఉన్నత ఉద్యోగులలో స్థిర పడటం ఎంతో సంతోషకరమని యాజమాన్యాన్ని అభినందించారు.

ఈ సందర్భంగా సంస్థ యూనివర్సిటీ యాజమాన్యం మంత్రి జోగి రమేష్ ని ఘనంగా సన్మానించి మెమెంటో బహూకరించారు.

అనంతరం ప్లేస్మెంట్ కార్యక్రమంలో ఉద్యోగాలు పొందిన వారి వివరాలు తో కూడిన గోడపత్రికను మంత్రి జోగి రమేష్ ఆవిష్కరించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page