తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హజ్ కమిటీ లో సభ్యునిగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్

Spread the love

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హజ్ కమిటీ లో సభ్యునిగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్, శామీర్ పేట్ మండల పరిషత్ కో ఆప్షన్ మెంబర్ మొహమ్మద్ ముజీబుద్దీన్ శామీర్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి ని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసారు.ఈ సందర్భంగా తనను కలిసిన ముజీబుద్దీన్ గారికి శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేకంగా అభినందనలు, ఆశీస్సులు అందించి రాబోయే రోజుల్లో హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులకు అన్ని రకాలుగా అండదండగా ఉండి వారి అభివృద్ధి, సంక్షేమంలో పాలు పంచుకోవాలని సూచించారు.

Related Posts

You cannot copy content of this page