సౌత్ వెస్ట్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కరాటే ఛాంపియన్ శంకర్‌పల్లి యువతి

Spread the love

ఈనెల 15 వ తేదీ నుండి 20వ తేది వరకు జరిగిన సౌత్ వెస్ట్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కరాటే ఛాంపియన్షిప్ మధ్యప్రదేశ్ భూపాల్ లో జరిగిందని కరాటే మాస్టర్ గడ్డం కుషాల్ తెలిపారు. ఈ టోర్నమెంట్ కి తెలంగాణ నుంచి 12 మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎంపికయ్యారు.

ఈ 12 మంది విద్యార్థులలో శంకరపల్లి మండల పరిధి మహారాజ్ పేట గ్రామానికి చెందిన బిస్త ధనవంతి సౌత్ నుంచి ఆల్ ఇండియా యూనివర్సిటీ ఏఐయు కరాటే ఛాంపియన్షిప్ కి ఎంపిక అయిందన్నారు. ఈ కరాటే ఛాంపియన్షిప్ పంజాబ్ చండీగర్ లో ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో జరుగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే ఉస్మానియా యూనివర్సిటీలో చదివే విద్యార్థి శంకర్‌పల్లి మండలానికి చెందిన యువతి ఎంపిక కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. బిస్త ధనవంతి మాట్లాడుతూ నా గెలుపుకు సహకరించిన మాస్టర్ కుశాల్ గడ్డం కు కృతజ్ఞతలు తెలిపింది. తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను కరాటేలో చేర్పించాలని వారు కోరారు.

Whatsapp Image 2024 01 25 At 6.22.19 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page