ఛలో నల్లగొండ భారీ బహిరంగ సభకు భారీగా తరలిన శేరిలింగంపల్లి డివిజన్ శ్రేణులు…రాగం నాగేందర్ యాదవ్

Spread the love

శేరిలింగంపల్లి డివిజన్ నుండి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సమక్షంలో ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ ఆధ్వర్యంలో నల్లగొండ సభకు భారీగా తరిలిన బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, వార్డ్ మెంబర్లు, బస్తీ కమిటీ మెంబర్లు, బస్తీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, యువ నాయకులు, మహిళా నాయకురాళ్లు. గచ్చిబౌలి ORR వద్ద శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి బయలుదేరిన బస్సు లను ఎమ్మెల్యే తో పాటు పలువురు కార్పొరేటర్ లతో, డివిజన్ అధ్యక్షులతో, నాయకులతో కలిసి ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కృష్ణా రివర్ మానేజ్మెంట్ బోర్డ్ (KRMB) కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ..కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ.. కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు..తెలంగా ణ సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ ఛలో నల్లగొండ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, వార్డ్ మెంబర్ శ్రీకళ, వార్డ్ మెంబర్ రాంబాబు, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, సీనియర్ నాయకులు పురం విష్ణు వర్ధన్ రెడ్డి, గోపాల్ యాదవ్, గడ్డం రవి యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, సుభాష్ రాథోడ్, జమ్మయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page