ఎలక్ట్రికల్ సమస్యలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో..శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

Spread the love

శేరిలింగంపల్లి డివిజన్ లోగల నల్లగండ్ల సెక్షన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ . బస్తీలలో పలు చోట్ల నూతనంగా వేసిన సీసీ రోడ్లలో ఎలక్ట్రికల్ పోల్స్ ఇబ్బందికరంగా మారాయని వెంటనే తొలగించాలని కార్పొరేటర్ ఎలక్ట్రికల్ డీఈ, ఏఈ కు ఆదేశించడం జరిగింది. గోపి నగర్, నెహ్రూనగర్, ఆదర్శ్ నగర్, ప్రశాంతి నగర్, బాపు నగర్ తదితర కాలనీలలో, బస్తిల్లో సిథిలావస్థకు చేరుకున్న కరెంటు పోల్స్ ను తొలగించి వాటి స్థానంలో నూతన కరెంట్ పోల్స్ ను ఏర్పాటు చేయాలని, కొన్ని చోట్ల ప్రమాదకరంగా ఇంటిపై నుండి వెళ్లిన విద్యుత్ వైర్లను తొలగించి ప్రత్యమమైన ఏర్పాటు చేయాలని, ప్రమాదకరంగా రోడ్డు పై ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తీసి ప్రత్యమమైన ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులకు వెల్లడించారు. అనంతరం కాలనీలలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి కార్పొరేటర్ పర్యటించారు.

ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ డీఈ గోపాల్ కృష్ణ, ఏడీ రాంబాబు, ఏఈ వెంకట నారాయణ రెడ్డి, సబ్ ఇంజనీర్ కిషోర్, లైన్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి, డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ సోమదాస్, కొండల్ రెడ్డి, వార్డ్ మెంబర్ పర్వీన్ బేగం, గోపినగర్ బస్తీ ప్రెసిడెంట్ గోపాల్ యాదవ్, ఆదర్శ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ మల్లారెడ్డి, లక్ష్మి నాయుడు, దాసోజు శ్రీనివాస్, నెహ్రు నగర్ బస్తీ ప్రెసిడెంట్ గఫర్, సత్యనారాయణ, పిల్లి యాదగిరి, అశోక్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, సుభాష్ రాథోడ్, ప్రభాకర్, మూర్తి, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page