మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని రాష్ట్ర పశుసంవర్ధక,

Spread the love

సాక్షిత : మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా సనత్ నగర్ లోని వెల్ఫేర్ సెంటర్ గ్రౌండ్ లో వేలాది మంది ముస్లీం సోదరులు నిర్వహించిన సామూహిక ప్రార్ధనలలో మంత్రి పాల్గొన్నారు. ప్రార్ధనల అనంతరం ముస్లీం సోదరులను ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ సందర్భంగా నెల రోజుల పాటు ఎంతో నిష్ఠతో ఉపవాస దీక్షలు చేస్తారని తెలిపారు. రంజాన్ ను ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ డివిజన్ BRS అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, నాయకులు సరాఫ్ సంతోష్ ఖలీల్, రాజేష్, జమీర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page