బహదూర్ పల్లిలోని 10వ వార్డులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు…

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీలోని బహదూర్ పల్లిలోని 10వార్డులో రూ.40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సి.సి రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు స్థానిక కౌన్సిలర్ బొంగునురి నవనీత శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి ఎల్లవేలలా కృషి చేస్తానన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పనిచేస్తామన్నారు. కాలనీలో పర్యటించి కాలనీ సభ్యులు మరియు స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు..
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మహేందర్ యాదవ్, సాయి యాదవ్, సీనియర్ నాయకులు సగ్గిడి శ్రీనివాస్, యస్వి సురేందర్ రెడ్డి, ఎక్స్ ఉప సర్పంచ్ రాఘవేందర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మునిసిపల్ వైస్ ప్రసిడెంట్ శామీర్ పేట రంగయ్య, మునిసిపల్ యూత్ అద్యక్షులు శ్రీకాంత్ యాదవ్, నాయకులు పి.వి.రావు, మహిపాల్ రెడ్డి, సంజీవ రెడ్డి, యాదిరెడ్డి, శేఖర్ యాదవ్, వెంకటేష్, రాము, హరీష్, రాజేష్, లడ్డు, మరియు స్థానిక నాయకులు, కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు….

Related Posts

You cannot copy content of this page