పి పి లాల్ కృష్ణ 2023-24 సంవత్సరానికి కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) విశాఖపట్నం జోన్ కు చైర్మన్ గా నియమించడం జరిగింది

Spread the love

సాక్షిత : విశాఖ ఫార్మసిటీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి పి లాల్ కృష్ణ 2023-24 సంవత్సరానికి కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) విశాఖపట్నం జోన్ కు చైర్మన్ గా నియమించడం జరిగింది. నిన్న 25.02.2023 నాడు హోటల్ ఫోర్ పాయింట్ షర్టన్, విశాఖపట్నం లో జరిగిన సిఐఐ 2022-23 వార్షిక సమావేశంలో ఈ నిర్ణయాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించడమైనది. గత సంవత్సరానికి వైస్ చైర్మన్ గా పనిచేసిన లాల్ కృష్ణ కి ఈ చైర్మన్ పదవి దక్కడము పట్ల జెఎన్పిసి పారిశ్రామిక వేత్తలు మరియు విశాఖ ఫార్మాసిటీ (రామ్ కి గ్రూప్) ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ అరుదైన అవకాశం దక్కడానికి ఆయనకు సిఐఐ సంస్థతో ఉన్న ఎన్నో సంవత్సరాల అనుబంధం, కృషి, పట్టుదల, అనేక దేశ విదేశాల ఫార్మా కంపెనీలు ఈ ఫార్మాసిటీలోకి రావడానికి కృషి చేయడం మరియు ఆయనకున్న అపారమైన జ్ఞాన సంపద తోడవడం వల్ల ఆయన ఈ అత్యున్నతమైన పదవిని సాధించడం జరిగింది. ఈ పదవి కాలం ఒక సంవత్సరం పాటు ఉంటుంది.

ఈ నియామకం జరిగిన తర్వాత సమావేశంలో అందరూ డాక్టర్ పి పి రామకృష్ణ కి అభినందనలు తెలియజేశారు. తదనంతరం విశాఖ ఫార్మాసిటీ హబ్ లో జరిగిన సమావేశంలో ఆ కంపెనీకి సంబంధించిన ఉద్యోగులు అందరూ కలిసి ఆయనకు అభినందనలు తెలియజేశారు మరియు ఆయనకు ఘనంగా సన్మానించడం జరిగింది. ఇలాంటి శిఖరాలు ఎన్నో అధిరోహించాలని ఉద్యోగులు ఆకాంక్షించారు. ఈ పదవి దక్కడం మా అందరికీ గర్వకారణం అని ఉద్యోగులు కొనియాడారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page